గుడివాడ అమర్నాథ్, వంగలపూడి అనితల మధ్య మాటల యుద్ధం
1159 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకుల మధ్య మాటలు మంటలు రగులుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన సిద్ధం సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్.. స్థానిక టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ గురించి. భారతి గురించి అనిత ఇష్టానుసారం మాట్లాడుతోందని.. ఇంకోసారి వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు, దీనిపై వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో చేతకాని, చేవలేని మంత్రి ఎవరంటే టక్కున కోడిగుడ్డు మంత్రని చెపుతారన్న అనిత.. టికెట్ పీకేసిన గుడివాడ అమర్నాథ్ తన నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. తాను టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తూ.. పాయకరావుపేటలో పోటీచేస్తున్నానని.. అమర్నాథ్కే ఎక్కడ పోటీచేస్తానో తెలియడం లేదని సెటైర్ వేశారు. ఇక ఆయనకు, తనకూ పోలికేంటని ప్రశ్నించారు.అమర్నాథ్ను పరిగెత్తించి కొట్టేందుకు జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు రెడీ ఉన్నారంటూ వంగలపూడి అనిత హెచ్చరించారు. ఫోటోలకు ఫోజులు తప్ప.. నువ్వు తెచ్చిన కంపెనీ పేరు చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గం వచ్చామా.. వెళ్ళామా.. అన్నుట్టుండాలి. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే గుడ్డు పగులుద్ధి అంటూ లైవ్ లో గుడ్డు పగులకొట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు.