డబ్బుల్లేకపోతే.. నంది అవార్డులపై మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు
నంది అవార్డులను ఉద్దేశించి నటుడు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే.. స్పాన్సర్లు కూడా ముందుకొస్తారని ఆయన చెప్పారు. తెలుగు పరిశ్రమ వినోదపు పన్ను కింద ప్రభుత్వాలకు పెద్ద మొత్తం చెల్లిస్తుందని, ఆ నిధులు ఏమవుతున్నాయని మురళీమోహన్ ప్రశ్నించారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఇటీవల దుబాయ్లో నంది అవార్డుల పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొంత మంది సీనియర్ నటులు హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు మురళీమోహన్ పైవిధంగా స్పందించారు.cinemaTimesXP TeluguUpdated: 15 May 2023, 5:20 pm