కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలకు శ్రీరెడ్డి కౌంటర్.. వామ్మో పులుసు కారిపోతుందట!
20943 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిNellore: కిరాక్ ఆర్పీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఆర్పీకి పులుసు కారిపోయేటైం దగ్గరపడిందంటూ వార్నింగ్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపైనా, ఆ పార్టీ నాయకులపై నోటికొచ్చినట్టు పేలుతున్న కిర్రాక్ ఆర్పీకి మూడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన కిరాక్ ఆర్పీ.. సీఎం జగన్పై, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, ప్రసన్న కుమార్లపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో ఆర్పీకి శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చింది. ‘వీడు భూమికి జానడు ఉంటాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే.. జగన్ గారి మీద, వైఎస్ఆర్ పార్టీపైన రాళ్లు వేయాలని అనుకుంటున్నావా? అసలు నువ్వెంత? నీ బతుకెంత? ఊకలో ఈకగాడివి. జగన్ అన్న వల్ల ఈ రోజు ఎంతమంది కడుపు నింపుకుంటున్నారో.. ఎంత మందికి ఉపాధి లభించిందో తెలుసా? ఈకగాడివి రెండు బ్రాంచ్లు పెట్టిన నీకే అంత ఉంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆయనకి ఎంత ఉండాలిరా. నీకు పులుసు కారే టైం వచ్చింది’ అంటూ పచ్చి బూతులతో వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.