ఏపీలో మళ్లీ గెలిచేది వైఎస్ జగనే: సుమన్
1225 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కొనసాగిస్తోన్న నవరత్నాలు పథకాలు వల్ల పేద ప్రజలకు చాలా మంచి జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సీనియర్ నటుడు సుమన్ తెలిపారు. అలాగే కరోనా సమయంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారని జగన్ తెలిపారు సుమన్. మైనారిటీతో పాటు అందరూ జగన్కు సపోర్ట్ చేస్తారని సర్వేలు అంటున్నాయి. అలాగే ప్రతి పక్షంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఆయన అన్నారు. మరోసారి జగన్ ప్రభుత్వమే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సుమన్ పేర్కొన్నారు. ఇంకా సమయం ఉండటంతో ఏదైనా పెద్ద మార్పు జరిగితే తప్ప, ఏం చెప్పలేమని అన్నారు సుమన్. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో సుమన్ ఈ కామెంట్స్ చేశారు.