క్యూలో నిలబడి ఓటేసిన నాగార్జున, అమల, నాగచైతన్య.. అఖిల్ ఎక్కడ?
13174 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అమల, పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. అయితే, ఆయన వెంట చిన్న కుమారుడు అఖిల్ రాలేదు. మరి ఆయన తరవాత వచ్చి ఓటు వేస్తారా? లేకపోతే ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో లేరా వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఈరోజు ఉదయం నుంచీ తెలుగు సినిమా ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, నాని, రవితేజ, గోపీచంద్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, శ్రీకాంత్.. ఇలా చాలా మంది ఓటు వేశారు. తాము ఓటు వేసిన విషయాన్ని కొంత మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.