విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఖమ్మం లకారం ట్యాంక్బండ్పై సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహాన్ని మే 28న మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆవిష్కరించనున్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఈ విగ్రహం సిద్ధమవుతోంది.