Lakshmi Manchu - మేము మాటలు చెప్పే రకం కాదు.. చేసి చూపిస్తాం: మంచు లక్ష్మి
1124 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితాము మాటలు చెప్పే రకం కాదని.. చేసి చూపిస్తామని అన్నారు సినీ నటి, విద్యావేత్త మంచు లక్ష్మీ ప్రసన్న. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, డిజిటల్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించాలన్నదే తమ లక్ష్యమని ఆమె అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మి.. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఆమె చర్చించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఏటా వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ సంవత్సరం జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.