గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మంచు మోహన్ బాబు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..అనంతరం ఆయన రూ.100 కోట్ల బడ్జెట్తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.