పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్పై పాలాభిషేకం
2035 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లా కేంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని సౌందర్య థియేటర్లో ‘బ్రో’ సినిమా విడుదలైంది. దీంతో అభిమానులు థియేటర్ వద్ద టపాసులు పేల్చి, డప్పుల మోత మోగించి సంబరాలు చేసుకున్నారు. థియేటర్ బయట పవన్ కళ్యాణ్ పోస్టర్లకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, మార్నింగ్ షో మొదలైన తరవాత కొంత మంది అభిబమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ మీద కనిపించిన పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం చేశారు. పాల ప్యాకెట్లు తీసుకొచ్చి స్క్రీన్ మీద పవర్ స్టార్ కనిపించినప్పుడు పాలు పోశారు. ఈ క్రమంలో అభిమానుల మధ్యే తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తెరను చింపేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. పవన్ కళ్యాణ్ అభిమానులను అరెస్ట్ చేశారు.