Dil Raju: సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు
1549 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిప్రముఖ నిర్మాత దిల్ రాజు సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య వైఘా రెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో దిల్ రాజు దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి శేష వస్త్రంతో దిల్ రాజును సత్కరించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దిల్ రాజు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలిసే శ్రీవారి ఆలయం నుంచి బయటికి వచ్చారు. ఇరు కుటుంబాలు కలిసి మీడియాకు ఫొటోలు తీసుకోవడానికి పోజులిచ్చారు.