టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడవగా.. పార్థివ దేహాన్ని చెన్నైలోని స్వగృహానికి తరలించారు. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ హీరో సూర్య.. శరత్ బాబు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.