శ్రీవారి సేవలో రమ్యకృష్ణ.. కొడుకుని తీసుకొచ్చిన శివగామి
141621 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిప్రముఖ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) కలియుగ దైవం ఏడుకొండల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుమారుడు రిత్విక్ వంశీతో కలిసి రమ్యకృష్ణ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో రమ్యకృష్ణ, రిత్విక్లకు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రమ్యకృష్ణతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కొంత మంది ఆసక్తి కనబరిచారు. కొడుకు చేయి పట్టుకుని రమ్యకృష్ణ ముందుకు సాగారు.