‘రుద్రమాంబపురం’ ట్రైలర్ రిలీజ్ చేసిన సుకుమార్
1094 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండివిలక్షణమైన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన మెప్పిస్తోన్న నటుడు అజయ్ ఘోష్ ఇప్పుడు రైటర్గా మారారు. ఆయన అందించిన కథతో రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’. ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు. మహేష్ బంటు డైరెక్ట్ చేశారు. జూలై 6 నుంచి ఈ మూవీ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ను పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ విడుదల చేసి చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ చిత్రంలో తిరుపతి అనే క్యారెక్టర్లో అజయ్ ఘోష్ నటిస్తున్నారు, పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు నటిస్తున్నారు. వెంగీ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. వెంకటేశ్వరరావు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.