గుజరాత్ రాష్ట్రం ఆరవల్లి జిల్లాలోని ఓ బాణాసంచా కంపెనీలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు అర్పేవేసే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ.. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.