రోడ్డు ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. బీచుపల్లి వద్ద కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.