మణిపూర్లో ఉద్రిక్తతలు చల్లారడంలేదు. మెజార్టీ కమ్యూనిటీ అయిన మైతై వర్గాన్ని షెడ్యూల్ ట్రైబ్లలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు కూడా దీనికి అంగీకరించింది. దీనిపై ఒక్కసారిగా మైతై ప్రజలు భగ్గుమన్నారు. ఈ క్రమంలో హింస చెలరేగింది. దీంతో దాదాపు 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సర్వీస్లను బంద్ చేశారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.