కర్ణాటక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై.. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరు పెద్ద హిందువు అని పోరాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ బహిరంగంగానే మతాన్ని ప్రస్తావించి ఓట్లు అడుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తక్బీర్ను ప్రస్తావించి ఓట్లు అడిగితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.