3 రోజుల్లో కరెన్సీ కష్టాలకు చెక్: అరున్ జైట్లీ
1002 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. దేశ ప్రజలను మళ్లీ కరెన్సీ కష్టాలు పట్టి పీడిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తు్న్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ కొరత తాత్కాలికమే అనీ, మరో 3 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. కరెన్సీ పరిస్థితిని సమీక్షించామనీ, తగినంత కరెన్సీ చెలామణిలో ఉందని తెలిపారు.