నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
1334 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిబీజేపీ నేత దారుణ హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. శంభాల్ జిల్లా మొరదాబాద్కు చెందిన అనూజ్ చౌధురిని గురువారం సాయంత్రం మొరాదాబాద్లోని ఆయన నివాసం బయటే దుండుగులు కాల్చి చంపారు. ఈ ఘటన మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అనూజ్ చౌధురి (34) తన అపార్ట్మెంట్ నుంచి మరో వ్యక్తితో కలిసి గురువారం సాయంత్రం బయటకు రాగా.. బైక్పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు, స్థానికులు మొరాదాబాద్లోని బ్రైట్స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోన్న అనూజ్.. రెండేళ్ల కిందట జరిగిన యూపీ బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో శంభాల్లోని అస్మోలీ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.