గంగానదిపై నిర్మాణంలో ఓ వంతెన పేక మేడలా కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బిహార్లోని భాగల్పుర్ జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న అగువానీ - సుల్తాన్గంజ్ వంతెన ఆదివారం కుప్పకూలింది. అయితే, డిజైనులో లోపాలు ఉన్నందున నిపుణుల సూచన మేరకు కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.