ఛత్తీస్ఘడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో.. బుధవారం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో మరణించిన జవాన్లకు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జవాన్ల త్యాగం వృథా కాబోదన్నారు. మావోయిస్టులపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.