కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. మలప్పురం జిల్లా తూవల్తీరం తనూర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. టూరిస్టులతో ఉన్న పడవ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. సామర్ధ్యానికి మించి బోటులో పర్యాటకులను ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు.