పాకిస్థాన్లోని ఓ ఆయుధ డిపోలో సోమవారం రాత్రి భారీ పేలుళ్లు సంభవించాయి. వాయువ్య పాకిస్థాన్లోని ఉగ్రవాద నిరోధక మందుగుండు సామాగ్రి డిపోలో పేలుళ్లు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో కనీసం 13 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వాయువ్య స్వాత్ లోయలోని ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో పేలుళ్లు సంభవించాయి.