భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీసీ-55 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమయ్యింది. 25.30 గంటల కౌంట్డౌన్ అనంతరం శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.