కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై పితలాటం కొనసాగుతోంది. హస్తినలో పోటాపోటీ లాబీయింగ్ జరుగుతోంది. దీంతో సీఎం సీటు ఎవరికి అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. కేఏ పాల్ కీలక కామెంట్స్ చేశారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు మళ్లీ నష్టం జరగకూడదు అంటే.. ఆయన్నే సీఎం చేయాలని స్పష్టం చేశారు.
generalTimesXP TeluguUpdated: 16 May 2023, 5:21 pm