ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అరణ్పూర్లో దారుణం జరిగింది. మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ను పొట్టన పెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు. డీఆర్జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా.. మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది చనిపోయారు.