ప్రజాభవన్కు తరలివచ్చిన జనం.. కిలోమీటర్ ట్రాఫిక్ జాం
1221 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిPraja Bhavan: గతంలో ప్రగతి భవన్గా ఉన్న పేరును జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్గా మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే వారానికి రోజులు మంగళవారం, శుక్రవారాల్లో ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తెల్లవారుజాము వరకే ప్రజా భవన్కు చేరుకున్నారు. దీంతో ప్రజా భవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.