పుణే సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలికి ఎంపీ సుప్రియా సూలే
మహారాష్ట్రలోని పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. చక్కెర లోడ్తో వెళ్తోన్న ట్రక్కు.. ఎదురుగా వస్తోన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 22 మంది గాయపడ్డారు. ఘటనా స్థలిని శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పరిశీలించారు. ప్రమాదం గురించి పోలీసులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు.generalTimesXP TeluguUpdated: 23 Apr 2023, 1:29 pm