భారతదేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి ముస్తాబైంది. ఈనెల 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ట్విటర్లో పంచుకున్నారు. అధునాతన హంగులతో కేవలం రెండేళ్లలోనే నిర్మించారు. భారతీయులంతా గర్వించేలా ఉందని ప్రధాని ట్వీట్ చేశారు. విశాలమైన భవనంలో లోక్సభ, రాజ్యసభలో సీటింగ్ అద్భుతంగా ఉంది. నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.
general|TimesXP Telugu|Updated: 26 May 2023, 7:14 pm