చంద్రయాన్-3 సక్సెస్ కావాలని తిరుపతిలో ప్రత్యేక పూజలు
17180 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచంద్రుడిపై అధ్యయనానికి భారత్ చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3 ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, భారీ ప్రయోగం. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.613 కోట్ల ఖర్చుచేశారు. నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం మీద దక్షిణ ధ్రువంపై దిగుతూ ల్యాండర్ సాంకేతిక సమస్యతో కూలిపోయింది. ఈ నేపథ్యంలో నాటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు లోపాలను సవరించి ఈసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్-3ను చేపట్టారు. మరోవైపు, చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని తిరుపతిలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వచ్చి.. భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేశారు.