ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు సభ్యురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గూడ్సు రైలు పట్టాలు తప్పలేదని, అందులో ఇనుప ఖనిజం ఉండటం వల్ల దాన్ని ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్ప్రెస్పై పెను ప్రభావం పడిందని రైల్వే బోర్డు సభ్యురాలు (ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) జయవర్మ సిన్హా అన్నారు.