విశాఖపట్నం నుంచి వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ వస్తోంది. ఈ మార్గంలో రాజమండ్రిలో ఆగింది. ఓ వ్యక్తి ఫొటోలు తీసుకుందామని ట్రైన్ ఎక్కాడు. ఆయన ఫొటోలు దిగే సంబరంలో ఉండగా.. టైం అయిపోయి డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయ్యాయి. కిందకు దిగుదామని ఎంత ట్రై చేసినా.. ఫలితం లేకపోయింది. దీంతో సదరు వ్యక్తి రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ట్రైన్లోనే ఉండిపోయారు.
generalTimesXP TeluguUpdated: 17 Jan 2023, 3:56 pm