యువతి పాదాాలకు మోదీ నమస్కారం
1357 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఢిల్లీ భారత మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవార్డులు పంపిణీ చేస్తుండగా.. ఓ యువతి ఆయన పాదాలను నమస్కరించేందుకు ప్రయత్నం చేసింది. అది గుర్తించిన ప్రధాని మోదీ.. వెంటనే అప్రమత్తమై ఆమెను ఆపేశారు. అనంతరం తిరిగి ప్రధాని మోదీ.. ఆమె పాదాలకు వంగి నమస్కారం చేశారు. ఈ అనూహ్య ఘటనతో ఆ కార్యక్రమానికి హాజరైన వారిని షాక్కు గురి చేసింది. విజేతలుగా నిలిచిన క్రియేటర్లకు ప్రధాని మోదీ.. అవార్డులు అందిస్తుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. అవార్డు అందుకున్న తర్వాత జాన్వీ సింగ్ అనే యువతి మోదీ పాదాలకు నమస్కరించాలని ప్రయత్నించింది. పాదాలకు నమస్కరించడం తనకు నచ్చదని.. ఆ యువతికి ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వెంటనే జాన్వీ సింగ్ పాదాలకు తిరిగి మోదీ నమస్కరించారు. హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ విభాగంలో జాన్వీ సింగ్ ఈ నేషనల్ క్రియేటర్ అవార్డును అందుకున్నారు. జాన్వీ సింగ్ మోదీ కాళ్లకు మొక్కడం.. తిరిగి ప్రధాని ఆమె కాళ్లకు నమస్కారించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.