కజిరంగా నేషనల్ పార్కులో మోదీ సవారీ
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
PM Modi: ప్రధాని మోదీ తొలిసారి కజిరంగ నేషనల్ పార్క్కు వెళ్లి ఏనుగుపై ఊరేగారు. శుక్రవారం రాత్రి కజిరంగ నేషనల్ పార్కుకు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడే బస చేశారు. అనంతరం శనివారం తెల్లవారుజామునే పార్కు మొత్తం సందర్శించారు. 1957 తర్వాత ఒక ప్రధాని అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్ను సందర్శించడం గమనార్హం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ను సందర్శించిన ప్రధాని.. ఏనుగు ఎక్కి అందులో పర్యటించారు. రాత్రి కజిరంగ నేషనల్ పార్క్లోనే బస చేసిన ప్రధాని.. తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్ కొహోరా రేంజ్ను సందర్శించారు. ముందు ఏనుగు ఎక్కి విహరించిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. ప్రధాని మోదీ వెంట కజిరంగ నేషనల్ పార్క్ డైరెక్టర్ సొనాలీ ఘోష్, అటవీ శాఖ సీనియర్ అధికారులు పలువురు ఉన్నారు.