ఏపీ మీదుగా కొత్తగా మూడు వందేభారత్ రైళ్లు.. ఈ స్టేషన్లలో ఆగుతాయి
1395 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిదక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపారు. పూరి-విశాఖపట్నం రైలును కూడా ప్రారంభించారు. వీటితో పాటు మొత్తం 10 వందేభారత్లను ప్రధాని నేడు వర్చువల్గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారంట్లను ప్రధాని నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు.