అతిఖ్ అహ్మద్ సోదరుల హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. గురువారం విచారణ కమిటీ క్రైమ్ సీన్ రీక్రియేట్ చేసింది. జ్యుడీషియల్ కమిటీ సమక్షంలోనే.. పోలీసులు గ్యాంగ్స్టర్ బ్రదర్స్ మర్డర్ ఎలా జరిగిందనే సీన్ను చూపించారు. ప్రయాగ్రాజ్లోని కెల్విన్ ఆస్పత్రి బయట ఏప్రిల్ 15వ తేదీ రాత్రి వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకెళ్తున్న అతిఖ్ను, అతని సోదరుడు అష్రఫ్ను కాల్చి చంపారు.