తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో.. స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి.. స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.