రెజ్లింగ్ చీఫ్ లైంగిక వేధింపులు.. క్రీడాకారులు ఆందోళన
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ట్రెయినర్ల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లింగ్ క్రీడాకారులు మరోసారి ఆందోళనకు దిగారు. బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి క్రీడాకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నిరసన చేపట్టారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్, ఇతర ట్రెయినర్లపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ నివేదికను కేంద్రం తక్షణం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.generalTimesXP TeluguUpdated: 24 Apr 2023, 9:46 am