పరువునష్టం కేసులో దోషిగా నిర్దారణ అయి రెండేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఆయన ఢిల్లీలో తన అధికార నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. ఈ బంగ్లాలో రాహుల్ గాంధీ 2005 ఏప్రిల్ 22 నుంచి నివాసం ఉంటున్నారు. సరిగ్గా అదే ఏప్రిల్ 22న ఆయన ప్రభుత్వ భవానాన్ని యాదృశ్చికంగా ఖాళీచేయడం గమనార్హం.