భారత్పై నోరు పారేసుకున్న మాల్దీవులు మంత్రులు.. మోత మొదలైంది!
3966 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిప్రధాని నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం లక్షద్వీప్లో పర్యటించారు. సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్ను పర్యటించాలని అక్కడి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ తన ఎక్స్ హ్యాండిల్లో మోదీ పోస్ట్ చేశారు. తాను సాహసాలు చేసిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. పర్యాటకాన్ని ఇష్టపడే భారతీయులు చాలా మంది లక్షద్వీప్ కోసం గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. నిజానికి భారతీయులకు ఇప్పటివరకు ది బెస్ట్ బీచ్ డెస్టినేషన్ అంటే మాల్దీవులు. ఏటా భారత్ నుంచి 2 లక్షలకు పైగా పర్యాటకులు మాల్దీవులను సందర్శిస్తున్నారు. అలాంటిది మోదీ పర్యటనతో ఒక్కసారిగా అందరి దృష్టి లక్షద్వీప్ వైపుకు మళ్లింది. దీన్ని మాల్దీవులు ప్రభుత్వంలో కొందరు ఓర్చుకోలేకపోయారు. నరేంద్ర మోదీ పోస్టుపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు సెటైర్లు వేశారు. భారత్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా అంతా ఒక్కటైంది. బాయ్ కాట్ మాల్దీవులు అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేసింది. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్ల వరకు అందరూ మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతోమంది ప్రముఖులు మాల్దీవులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దేశీయ టూరిజంను ప్రోత్సహించాలన్నారు. భారత్ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఇప్పటికే మాల్దీవుల పర్యాటకంపై ప్రభావం పడింది. వేలాది మంది భారతీయులు తమ మాల్దీవులు టూర్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇకపై తాము మాల్దీవుల్లో పర్యటించమంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ఈజ్ మై ట్రిప్ సంస్థ మాల్దీవులకు తమ ప్యాకేజీలను రద్దు చేసింది. ఫ్లైట్ బుకింగ్స్ను ఆపేసింది. ఈ పరిమాణాలు మాల్దీవులకు పెద్ద దెబ్బ.