అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. త్వరలో పట్టాలెక్కనున్న సరికొత్త రైళ్లు
30729 views
జనరల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిAmrit Bharat Express Train: ఇండియన్ రైల్వే సామాన్యుల కోసం మరో కొత్త రకం రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే భారత్ తరహాలోనే అమృత్ భారత్ పేరుతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలకు ప్రయాణ సేవలు అందించాలనేది అమృత్ భారత్ రైళ్ల లక్ష్యం. ఇవి ఏసీ, నాన్-ఏసీ పుష్-పుల్ రైళ్లు. అంటే, ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. గంటకు 130 కి.మీ. వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. ఒక్కో రైలులో 22 LHB బోగీలు, వాటిలో 12 స్లీపర్, 8 జనరల్, 2 లగేజీ కోచ్లు ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్, బయో వ్యాక్యూమ్ టాయ్లెట్స్, సెన్సార్ ట్యాప్స్ ఇలా అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. అయోధ్య నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రెండు అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.