తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. దేశాన్ని విభజించే విద్వేషపూరిత రాజకీయాలను చేయాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. నా ప్రాణాలనైనా ఇస్తాను కానీ, దేశ విభజనకు అనుమతించబోనని మమతా ఉద్ఘాటించారు.