తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అన్ని పార్టీలు చేరికలపై ఫోకస్ పెట్టాయి. తాజాగా.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పర్యటించారు. చినపెండ్యాల వద్ద ఈటల రాజేందర్ సమక్షంలో.. వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి ఈటల పార్టీలోకి ఆహ్వానించారు.