CSK కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోని.. అభిమానులకు షాక్
MS Dhoni; చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాక్. ఆ జట్టు అభిమానులు ‘తలా’గా అభిమానించే ఎం.ఎస్. దోనీ.. కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను నియమించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే.. ఐపీఎల్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. ఎమ్మెస్ ధోనీ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అంతేకాదు, మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో చెన్నై చిరస్మరణీయమైన విజయాలు అందుకుంది. 2022 సీజన్లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించి నిరాశపర్చిన సీఎస్కే.. 2023 సీజన్లో విజేతగా నిలిచింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. తొలి సీజన్ సహా ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది. ఓసారి సెమీఫైనలిస్ట్గా నిలిచింది. చెన్నై జట్టు కేవలం 2020, 2022 సీజన్లలో మాత్రమే ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2024లో కొత్త పాత్రలో కనిపిస్తానని ధోనీ కొద్ది రోజల కిందటే ప్రకటించాడు. దీంతో మహీ కెప్టెన్సీ పగ్గాలు వదిలేస్తాడేమోననే ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహించినట్టుగానే ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడుతున్నాయి.- TimesXP Telugu
- sports
- Ms Dhoni Hands Over Chennai Super Kings Captaincy To Ruturaj Gaikwad Ahead Of Ipl 2024