ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థి.. కుటుంబానికి బీజేపీ నేతల ఓదార్పు
1004 views
ఆదిలాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిరష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి కుటుంబానికి బీజేపీ నేతలు భరోసానిచ్చారు. అదిలాబాద్ పట్టణ ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన గజానంద్ కుమారుడు వంశీకృష్ణ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉక్రెయిన్ వెళ్లి చిక్కుకుపోయాడు. దీంతో తమ కుమారుడి పరిస్థితి తలుచుకుని అతడి కుటుంబం కుమిలిపోతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తదితరులు ఆయన ఇంటికి చేరుకుని ఓదార్చారు. వంశీకృష్ణ క్షేమంగానే ఉన్నాడని చెప్పి గజానంద్కి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన ఎంపీ సోయం బాపురావు.. జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. పిల్లలందరూ ఉక్రెయిన్లో క్షేమంగానే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అందరినీ స్వదేశానికి తీసుకొస్తుందని తెలిపారు.