ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్లో ఆమె పీఏ దరఖాస్తును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోవటంతో అసంతృప్తిలో ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆమె కంటతడిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను మోసం చేసిందని అన్నారు. జాన్సన్ అసలు ఎస్టీనే కాదని.. అతడిని ఈ ఎన్నికల్లో గెలవనీయనని అన్నారు. ఈ సారి కూడా నియోజవర్గ ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పారు.
adilabadTimesXP TeluguUpdated: 22 Aug 2023, 1:43 pm