ఖబడ్జార్ బిడ్డా.. ఇప్పుడే ఏం కాలేదు.. జాన్సన్కు రేఖానాయక్ వార్నింగ్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించిన ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అభివృద్ధి చేయలేదని ప్రచారం చేస్తే ఊరుకోను.. ఖబర్థార్ బిడ్డా అంటూ రేఖా నాయక్ హెచ్చరించారు. జాన్సన్ నాయక్ అబద్దాలు ప్రచారంచేస్తే.. నడిరోడ్డుపై నిలబెట్టి కొడుతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏమి అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. జాన్సన్ నాయక్ను ప్రశ్నిస్తే రౌడియిజం చేస్తున్నాడంటూ ఆరోపించారు. ప్రశ్నించినవారిపై దాడులు చేయిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడేం కాలేదు బిడ్డా.. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని జాన్సన్ను రేఖనాయక్ హెచ్చరించారు.
Authored byCurated byరామ్ ప్రసాద్|TimesXP Telugu|18 Sept 2023