మంత్రి కేటీఆర్ ములుగు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే సమయంలో.. ఎమ్మెల్యే సీతక్క శిలాఫలకాలకు కొంచెం దూరంగా నిలబడి ఉన్నారు. అది గమనించిన మంత్రి కేటీఆర్.. ఆమెను తనవైపు నిలబడాలని కోరారు. ఈ క్రమంలో ఆయన పక్కనే ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ కవితలను కొంచెం జరగాలని చెప్పారు. అనంతరం గ్రూపుగా ఫోటోలకు పోజులిచ్చారు.
hyderabadTimesXP TeluguUpdated: 7 Jun 2023, 4:09 pm