'ఏపీలో లేని ఆనందం తెలంగాణలో ఏముంది'.. మాజీ సీఎస్పై భట్టి ఫైర్
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ప్రత్యేక సలహాదారుడిగా నియమించటంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ఏపీలో ఉద్యోగం చేయలేక వీఆర్ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్.. తెలంగాణలో ఉద్యోగం చేయటానికి గల కారణాలేంటని ప్రశ్నించారు. అక్కడ లేని ఆనందం ఇక్కేడేముందని నిలదీశారు. భూములను స్వాహా చేయటానికి సోమేశ్ కుమార్ను మళ్లీ తీసుకొచ్చి పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
hyderabadTimesXP TeluguUpdated: 14 May 2023, 4:45 pm