చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన అమిత్ షా.. సీఎం కేసీఆర్పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారన్న అమిత్ షా.. తర్వాత ప్రధాని కూడా మోదీనే అని తెలిపారు. ముందు సీఎం సీటును కాపాడుకోవాలని కేసీఆర్కు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్ట్ చేయటంపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.